భారతదేశం లో జరిగే ఎన్నికల విషయంలో అమెరికా పాత్ర గురించి.. గత రెండు రోజులుగా చర్చ సాగు తోంది. భారత్ లో ఓటర్ల శాతాన్ని పెంచేందుకు అమెరికా నిధులు ఇస్తున్న విషయం నిన్న మొన్నటి వరకు నర్మగర్భంగా ఉంటే.. ట్రంప్ తీసుకున్న నిర్ణయం తర్వాత.. ఈ విషయం అందరికీ తెలిసింది. అమెరికా ఇస్తున్న 2.1 కోట్ల అమెరికన్ డాలర్లను నిలిపివేస్తూ.. తాజాగా ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. భారత్ కూడా సంపన్న దేశమేనని.. ఆ దేశానికి నిధులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.