30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ ఈ మధ్య కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతున్నారు. ఒకప్పుడు వైసీపీలో ఉన్న పృథ్వీ ఇప్పుడు అదే పార్టీకి యాంటీగా మారారు. ఇటీవల విశ్వక్ సేన్ `లైలా` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీరి ఉద్దేశించి పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైసీపీ నేతలు పృథ్వీపై విరుచుకుపడ్డారు. ఏకంగా బాయ్ కాట్ లైలా అంటూ ట్రెండ్ చేశారు. కారణం ఏదైనప్పటికీ లైలా ఫ్లాప్ అయింది.